దక్షిణాదిలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఎంపీ కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశమేం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది
కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
ఇప్పటికే హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయమై వివరణ ఇచ్చారు. హైదరాబాద్ను రెండో రాజధాని చేసే యోచన కేంద్రానికి లేదన్నారు. కానీ అంతకు ముందు మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర రావు మాట్లాడుతూ.. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో.. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందేమోనని వ్యాఖ్యానించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.