
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:అక్టోబర్ 13
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (85) ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5:30 గంటలకు హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేగా సుపరి చితులైన కొండా లక్ష్మారెడ్డి, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా సేవలందించారు.
కొద్ది రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన ను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స ఫలించక మరణించారు. జర్నలిజంపై ఆయనకున్న మక్కువతో 1980లో స్థానిక వార్తా సంస్థ ఎన్ఎస్ఎస్ ను స్థాపించారు. జర్నలిస్ట్ హక్కుల కోసం కృషి చేసిన ఆయన జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్స్ కోఆప రేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షు డిగా కూడా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన కొండా లక్ష్మారెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ,ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్తో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్గా పలు కీలక పదవులను నిర్వహించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.