వార్త నేత్రం : ప్రతినిది
రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు భార్య తగిన శిక్ష విధించింది. అందరూ చూస్తుండగానే పెళ్లి మండపానికి వెళ్లి చెప్పుతో కొట్టింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఇక్కడ ఒక వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ కట్నం కోసం దురాశతో మొదటి భార్యకు తెలియకుండా రెండో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు.
కానీ అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో.. ఆమె పెళ్లి మండపానికి వెళ్లి అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
కట్నం కోసం సెకండ్ మ్యారేజ్
చిక్కమగళూరు జిల్లా అరసికెరెలోని తిప్పఘట్టకు చెందిన కార్తీక్ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం తనూజ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే అతడికి కట్నం ఆశ ఎక్కువవడంతో కార్తీక్ మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో కర్ణాటకలోని చిత్రదుర్గలోని కోటేనాడులోని గాయత్రి కల్యాణ మంటపంలో మ్యారేజ్ సెట్ చేశాడు.
Discover more from varthanethram.com
Subscribe to get the latest posts sent to your email.