Sunday, September 7, 2025
Homeవార్తా నేత్రంట్రిమ్మర్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

ట్రిమ్మర్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

వార్త నేత్రం : ప్రతినిది

ట్రిమ్మర్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లిలో చోటుచేసుకుంది. బసంత్‌నగర్‌ ఎస్సై స్వామి, స్థానికుల కథనం మేరకు.. ముంజంపల్లికి చెందిన బొమ్మగాని తిరుపతి (32) ఉపాధిహామీ కూలీగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం అతను బాత్‌రూంలో ట్రిమ్మర్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా.. దానికి విద్యుత్తు సరఫరా అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అతను కిందపడిపోగా కుటుంబ సభ్యులు ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. తిరుపతికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు.


Discover more from varthanethram.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page